ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలి.-- ఎస్సై సులువ వెంకటేష్.
ప్రజా గొంతుక( జనవరి 21) కాల్వ శ్రీరాంపూర్ :రోడ్డు భద్రత, ప్రతి పౌరుడి బాధ్యత అని ఎస్ఐ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఐ వెంకటేష్ వాహనదారులకు మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, ద్విచక్ర వాహనదారులకు సూచించారు. హెల్మెట్ కేవలం ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, ప్రాణ రక్షణకు అత్యంత కీలకమైన సాధనం అన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మైనర్లు వాహనం నడపడలు, కారు నడిపే వాళ్ళు సిటీ బెల్టు ధరించకపోవడం వంటివి వాహన ప్రమాదాలు కారణాలమవుతున్నాయని తెలిపారు. ప్రమాద రహిత ప్రయాణానికి ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు. ప్రాణం ఎంతో విలువైనదన్నారు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపలన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్, వాహనదారులు తదితరులు ఉన్నారు.













