మృతురాలు కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేత...
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలంలో ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తోచిన సహాయాన్ని అందించి అండగా ఉంటామని యువ నాయకులు రసూల్,అఖిల్ మాల అన్నారు మండలంలోని కొన్నే గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన గునిగంటి భాగ్యలక్మి కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించగా బుధవారం దశదినకర్మ కావడంతో మృతురాలు భాగ్యలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేసి మేమున్నామని ధైర్యనిచ్చారు అదేవిధంగా మండలంలో ఏ గ్రామంలో ఆయన ఆపద ఉంటే వారి దృష్టికి తీసుకొస్తే తోచిన సహాయాన్ని అందించి అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో చెవుల రాజేష్, బొలుగుల చందు,రాయపురం కార్తీక్, గంధమల్ల స్టాలిన్,రాజు, తదితరులు పాల్గొన్నారు...












