హెల్మెట్ లేకుంటే ప్రాణాలకు ముప్పే...
అరైవ్ అలైవ్–2026’తో రోడ్డు ప్రమాదాలపై ఉక్కుపాదం..
జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: జనవరి:20
జిల్లాలో ఏడాదిలో 360 మంది మృతి 90% ద్విచక్ర వాహనదారులే.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ‘అరైవ్ అలైవ్ (2026)’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
రోడ్డు భద్రత అవగాహనా సదస్సులో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొని కీలక హెచ్చరికలు చేశారు.
నల్గొండ జిల్లా పరిధిలో 900 నుంచి 950 వరకు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా, అందులో 360 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో సుమారు 90 శాతం మంది ద్విచక్ర వాహనదారులే కాగా, హెల్మెట్ ధరించకపోవడమే ప్రధాన కారణమని.
హెల్మెట్ ట్రాఫిక్ నిబంధన మాత్రమే కాదని, ప్రాణాలను కాపాడే రక్షణ కవచం అని స్పష్టం చేశారు
అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ వాడుతూ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిని నియంత్రిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది
రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత జిల్లా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు
మొత్తం రోడ్డు ప్రమాదాలు (2025): 900–950.
ప్రధాన కారణం: హెల్మెట్ ధరించకపోవడం
ప్రమాదాలకు దోహదం చేస్తున్నవి*అతివేగం
మద్యం సేవించి డ్రైవింగ్
మొబైల్ ఫోన్ వాడకం
మైనర్ డ్రైవింగ్..













